← Back to news

మంత్రి కొండా సురేఖ ఆత్మవిమర్శ చేసుకోవాలి

By KONTU SAGAR· 22 Aug 2026
మంత్రి కొండా సురేఖ ఆత్మవిమర్శ చేసుకోవాలి

TG: ముఖ్యమంత్రిపై మంత్రి కొండ సురేఖ కూతురు చేసిన కామెంట్స్ తనకు సంబంధం లేదని మాట్లాడడం సరికాదని, ఆత్మవిమర్శ చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. అసెంబ్లీ సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, ఆది శ్రీనివాస్‌లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సురేఖ చేసే పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల మనసు గాయపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పైన, వారి సోదరులపైన ఆమె కూతురు విమర్శలు చేస్తుంటే కొండా సురేఖ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.

More in Local