రెండు అంగన్ వాడీ సెంటర్లకు ఒకే ఆయమ్మ... ఆమెనే టీచర్...

ఒకే చోట నిర్వహిస్తున్న రెండు అంగన్ వాడి కేంద్రాలలో ఒకే ఒక్క ఆయమ్మ 25 మంది పిల్లలకు పాఠాలు చెబుతోంది. షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు మండలం ఆగిర్యాల గ్రామంలో పరిస్థితి ఇది. ఒక కేంద్రంలో ఏడాదికిృతమే అంగన్ వాడి టీచర్, ఆయా పదవి విరమణ చేశారని ఆ కేంద్రాన్ని 2వ కేంద్రంలోకి మార్చి ఒక టీచర్, ఆయాతో కొనసాగించారు. నాలుగు నెలల క్రితం ఇక్కడ టీచర్ కూడా పదవీ విరమణ చేయడంతో ప్రస్తుతం ఒక్క ఆయా మాత్రమే ఉన్మది. పాఠాలు కూడా చెప్తుంది. ఈ సమస్యపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు అంటున్నారు.



