YCP నేతపై హత్యాయత్నం.. తాడిపత్రిలో ఉద్రిక్తత

AP: అనంతపురం జిల్లా తాడిపత్రి PS దగ్గర YCP నేత గంగులకుంట కేశవరెడ్డిపై కొంతమంది దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్రగాయాలు అవడంతో స్థానికులు హాస్పిటల్కు తరలించగా ఆస్పత్రి వద్ద కూడా కేశవరెడ్డిపై దాడి జరిగింది. ఈ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, JC ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ఓ స్పార్పియో వాహనం, ఆస్పత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. తాడిపత్రిలో JC, కేతిరెడ్డి వర్గాల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.



