క్లైమేట్ యాక్టివిస్ట్ వాంగ్ చుక్ గురించి మీకు తెలుసా?

లడఖ్కు చెందిన సోనమ్ వాంగ్చుక్ విద్యా సంస్కరణలు, పర్యావరణ ఆవిష్కరణలతో పాటు రాజకీయ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారు. 1988లో SECMOL స్కూల్ ను స్థాపించి స్థానిక విద్యా విధానాన్ని మార్చడం ద్వారా టెన్త్ పాస్ శాతాన్ని 5% నుండి 75%కి పెంచారు. ఈ కృషికి గానూ 2018లో ఆయనకు రామన్ మెగసేసే అవార్డు దక్కింది. పర్యావరణ రక్షణ కోసం 'ఐస్ స్తూపాలు' లాంటి వినూత్న ఆవిష్కరణలు చేసిన వాంగ్చుక్, లడఖ్కు ప్రత్యేక గుర్తింపు, రక్షణ కల్పించే ఆరో షెడ్యూల్ అమలు కోసం పెద్ద ఎత్తున పోరాడారు. ఈ క్రమంలో జైలు శిక్షను కూడా ఎదుర్కొన్నారు. ఇటీవల విద్యా రంగ సంస్కరణల కోసం ఢిల్లీలో 20 రోజులకు పైగా దీక్ష చేస్తున్నారు.



