అమెరికాలో తెలుగు మహిళ హత్య .. షాకింగ్ ట్విస్ట్

AP: అమెరికాలో గత 8నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విజయవాడకు చెందిన రజిత సబ్బినేని కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజితను ఆమె భర్త అవినాశ్ నార్నే హత్య చేసినట్లు అమెరికా పోలీసులు గుర్తించారు. పెళ్లైన 4నెలలకే ఆమెను దారుణంగా చంపినట్టు విచారణలో నిర్ధారణ అయింది. ఆమెకు శ్వాస ఆడకుండా అతడు గొంతు నులిమినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. మరో మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు తెలిపారు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఆయన ప్రయత్నించినట్లు తెలిపారు. నిందితుడు అవినాశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.



