← Back to news

అమెరికాలో తెలుగు మహిళ హత్య .. షాకింగ్ ట్విస్ట్

By DK· 10 Jul 2026
అమెరికాలో తెలుగు మహిళ హత్య .. షాకింగ్ ట్విస్ట్

AP: అమెరికాలో గత 8నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విజయవాడకు చెందిన రజిత సబ్బినేని కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజితను ఆమె భర్త అవినాశ్‌ నార్నే హత్య చేసినట్లు అమెరికా పోలీసులు గుర్తించారు. పెళ్లైన 4నెలలకే ఆమెను దారుణంగా చంపినట్టు విచారణలో నిర్ధారణ అయింది. ఆమెకు శ్వాస ఆడకుండా అతడు గొంతు నులిమినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. మరో మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు తెలిపారు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఆయన ప్రయత్నించినట్లు తెలిపారు. నిందితుడు అవినాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 19h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.