శేరిలింగంపల్లిలో ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలు

TG: వందేమాతరం గీతం 150 ఏళ్లు, 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి మసీద్ బండ క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ఆ సెల్ఫీని harghartiranga.comలో అప్లోడ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.



