← Back to news

నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం

By DK· 25 Jun 2026· నెల్లూరు జిల్లా
నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం

AP: నెల్లూరు జిల్లా మనుబోలు వద్దనున్న నేషనల్ హైవేపై రోడ్ యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వెళుతున్న ఆటో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గూడూరు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. గూడూరు రూరల్ మండలం చెన్నూరుకు చెందిన కూలీలు మనుబోలు మండలం వీరంపల్లిలోని ఓ రొయ్యల కేంద్రం ప్రాసెస్ యూనిట్‌లో పనిచేసేందుకు వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 21h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.