నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం

AP: నెల్లూరు జిల్లా మనుబోలు వద్దనున్న నేషనల్ హైవేపై రోడ్ యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వెళుతున్న ఆటో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గూడూరు ఏరియా హాస్పిటల్కు తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. గూడూరు రూరల్ మండలం చెన్నూరుకు చెందిన కూలీలు మనుబోలు మండలం వీరంపల్లిలోని ఓ రొయ్యల కేంద్రం ప్రాసెస్ యూనిట్లో పనిచేసేందుకు వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.



