కాలేజీకి వెళ్లాలంటే ప్రాణాలతో చెలగాటం

AP: కాకినాడ జిల్లా కరప మండలంలో ఆర్టీసీ బస్సుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ పెరిగినా, అందుకు అనుగుణంగా అదనపు బస్సులు అందుబాటులోకి రాలేదు. వేలంగి నుంచి నడకుదురు వరకు సుమారు 15 గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. బస్సుల్లో చోటులేక ఫుట్బోర్డులపై ప్రమాదకరంగా నిలబడుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు హెచ్చరిస్తున్నా కాలేజీ సమయానికి చేరుకోవాలనే ఆత్రుతతో తప్పనిసరి పరిస్థితుల్లో అలా ప్రయాణిస్తున్నారు.




