ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
AP: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల కేంద్రంలో గిరిజన మహిళలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామంగా ఉన్న రోలుగుంటలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరాహ నదిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో తక్షణమే ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. గ్రామంలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని కోరారు.

