← Back to news

ఆస్పత్రిలోనే బాలింత సూసైడ్

By dk· 12 Aug 2026· నల్గొండ జిల్లా
ఆస్పత్రిలోనే బాలింత సూసైడ్

TG: నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27) ప్రసవం కోసం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ప్రసవం అనంతరం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున వార్డు నుంచి బయటకు వచ్చి హాస్పిటల్ ఆవరణలో చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వరుసగా నలుగురు ఆడపిల్లలే పుట్టడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, అత్తింటి వేధింపులే మమత ఆత్మహత్యకు కారణం అని ఆమె బంధువులు ఆరోపించారు.

More in TG