కర్ణాటకలో ఘోరం.. అమెరికన్ మహిళా టూరిస్టుపై అత్యాచారం !

విదేశాల్లో భారత్ ప్రతిష్టని దిగజార్చే మరో అత్యాచార ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. కూర్గ్కు విహారయాత్రకు వచ్చిన ఒక అమెరికన్ మహిళపై హోమ్ స్టే యజమాని వృజేష్ కుమార్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఎవరికీ ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు మూడు రోజుల పాటు వైఫై (WiFi) కనెక్షన్ను కట్ చేసి బాధితురాలిని బంధించాడు. అతి కష్టమ్మీద తప్పించుకున్న ఆ టూరిస్ట్ ఫిర్యాదు మేరకు పోలీసులు వృజేష్ కుమార్, అతని అసిస్టెంట్ ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

