నేతన్నలకు ప్రభుత్వం ఉపాధి భరోసా: ఆది శ్రీనివాస్

TG: నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని MLA ఆది శ్రీనివాస్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో నేతన్న విగ్రహానికి నివాళులర్పించారు. CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేనేత, వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. గత ఏడాది 6.70 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వగా, ఈ ఏడాది ఇప్పటికే 4.50 కోట్ల మీటర్లకు అవకాశం కల్పించామని చెప్పారు. బీమా, రుణమాఫీ, విద్యుత్ సబ్సిడీలతో నేతన్నలకు భరోసా కల్పిస్తున్నామన్నారు.



