త్విషా శర్మ కేసులో కస్టడీలోకి భర్త... లాప్రాక్టీస్ పై వేటు

త్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పరారీలో ఉన్న నిందితుడు, ఆమె భర్త సమర్థ్ సింగ్ను భోపాల్ పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతని న్యాయవాద వృత్తి ప్రాక్టీస్పై తక్షణమే నిషేధం విధించింది. మరోవైపు, ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా, మరణానికి గల అసలు కారణాలను తేల్చేందుకు ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) బృందంతో రెండవసారి పోస్ట్మార్టం (అటాప్సీ) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.పెళ్లయిన రెండు నెలలకే త్విషా అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.



