కేదార్ నాథ్ లో మొబైల్ ఫోన్ల నిషేధం...

కేదార్ నాధ్ ఆలయ పరిసరాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించారు. కొండపై వీడియోలు, ఫోటో షూట్స్, రీల్స్ ఇక ఎంత మాత్రం అనుమతించబోమని ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు ఆలయ పరిసరాల్లోకి వచ్చే ముందే తమ మొబైల్స్ ను బయటే డిపాజిట్ చేయాలని కోరింది. కొండపై మొబైల్స్ అనుమతి వల్ల దర్శనాలకు భంగం కలుగుతోందని, ఆధ్యాత్మికత తగ్గుతోందని ఆలయ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఈనిర్ణయాన్ని ఇంటర్నెట్ యూజర్స్ సమర్ధించారు.

