అమ్మవారి తాళిబొట్టు కూడా వదల్లేదు

AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని ఎల్లమ్మ టెంపుల్లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ ప్రధాన గేటు తాళాలు పగులగొట్టిన దొంగలు CCTV కెమెరాలను ధ్వంసం చేశారు. అమ్మవారి విగ్రహానికి ఉన్న 11 గ్రాముల బంగారు తాళిబొట్టుతో పాటు, ఆలయ ప్రాంగణంలో ఉన్న మినరల్ వాటర్ కాయిన్ బాక్స్ను ఎత్తుకెళ్లారు. ఆలయంలో ఏళ్ల తరబడి హుండీ లెక్కింపు చేపట్టకపోవడంతో అందులో భారీగా నగదు ఉన్నట్లు సమాచారం. దుండగులు ఆ హుండీని పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



