ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

విశాఖ నగరం గాజువాకలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ యాక్సిడెంట్లో ముగ్గురు చనిపోయారు. ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సు రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వైపునకు వెళ్తోంది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.



