స్టూడెంట్స్ కోసం రంగంలోకి MP చంద్రశేఖర్ ఆజాద్!
విద్యార్థుల నిరసనలకు మద్దతుగా MP చంద్రశేఖర్ ఆజాద్ పార్లమెంట్ ఆవరణలోని బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద రాత్రంతా ధర్నా చేశారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే విని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు విద్యార్థులకు తోడుగా తన పోరాటం కొనసాగుతుందని క్లియర్ గా చెప్పారు.


