గన్నెల గ్రామంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక

AP: ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామ సచివాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రెవెన్యూ, తాగునీరు, విద్యుత్, పింఛన్లు తదితర అంశాలపై మొత్తం 64అర్జీలు స్వీకరించారు. ప్రతి వినతిని అధికారులు వెంటనే పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.



