← Back to news

తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయ ద్వారం

By aravinda nyayapati· 22 Apr 2026· Hyderabad
తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయ ద్వారం

చార్ ధామ్ యాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు ఉదయం 8 గంటలకు తెరుచుకున్నాయి. శీతాకాలంలో ఆరు నెలల పాటు మూసుకునే ఈ ఆలయాన్ని మళ్లీ అక్షయ తృతీయ తర్వాత రెండు మూడు రోజులకి తీస్తారు. ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకి అంటే యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదారానాథ్ సందర్శనకి రికార్డు స్థాయిలో 14.5 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కేదారాథ్ లో మహా శివుడి దర్శనం కోసమే ఏకంగా 4.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

More in Local