← Back to news

తిరుపతిలో దొంగల బెడద..! లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు..!

By DS· 31 May 2026· tirupati

తిరుపతిలో దైవ దర్శనాలకు వచ్చే భక్తులే టార్గెట్ గా చోరీలు జరుగుతున్నాయి. వరుసగా ఒకే హోటల్ లో రెండు ఘటనలు జరగడంతో అనుమానాలు పెరుగుతున్నా యి. ముందు ఘటనలో 20 లక్షలు మాయం కాగా తాజాగా రెండో ఘటనలో వెయ్యి డాలర్లు మాయమయ్యాయి.మానస సరోవరం హోటల్, రూమ్ నెంబర్ 1017లో ఈ ఘటన జరిగింది. సింగపూర్ నుండి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్నారై ఆర్ముగం కుటుంబం శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి హోటల్ కి వచ్చి చూసుకోగా లాకర్స్ ఉంచిన 1000 డాలర్స్ మాయం అయ్యాయి.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.