తిరుపతిలో దొంగల బెడద..! లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు..!
తిరుపతిలో దైవ దర్శనాలకు వచ్చే భక్తులే టార్గెట్ గా చోరీలు జరుగుతున్నాయి. వరుసగా ఒకే హోటల్ లో రెండు ఘటనలు జరగడంతో అనుమానాలు పెరుగుతున్నా యి. ముందు ఘటనలో 20 లక్షలు మాయం కాగా తాజాగా రెండో ఘటనలో వెయ్యి డాలర్లు మాయమయ్యాయి.మానస సరోవరం హోటల్, రూమ్ నెంబర్ 1017లో ఈ ఘటన జరిగింది. సింగపూర్ నుండి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్నారై ఆర్ముగం కుటుంబం శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి హోటల్ కి వచ్చి చూసుకోగా లాకర్స్ ఉంచిన 1000 డాలర్స్ మాయం అయ్యాయి.



