ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. మే 1 నుంచి 31 లోగా బదిలీల ప్రక్రియ పూర్తి కావాలని జీవో నెంబర్ 38 జారీ చేసింది. ఒకే చోట నాలుగేళ్లుగా వర్క్ చేస్తున్న వాళ్లని బదిలీ చేయనున్నారు. ఎవరైనా బదిలీ కోరుకుంటే కంటిన్యూస్ గా మూడేళ్లు ఒకే చోట పని చేసి ఉండాలి. ఉద్యోగులు బదిలీల ఉత్తర్వులు అందుకున్న తర్వాత మూడు రోజుల్లోగా కొత్త చోట జాయిన్ కావాల్సి ఉంటుంది. జనగణన వర్క్ లో ఉన్న ఉద్యోగులకు మాత్రం బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది.

