మోదీ ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్ గాంధీ!
స్టూడెంట్స్ సమస్యలు, ఎగ్జామ్ పేపర్ లీకేజీలు, ఎడ్యుకేషన్ సిస్టమ్లో లోపాలపై పార్లమెంట్లో డిస్కషన్ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ప్రొటెస్ట్ ప్రదేశాల్లో పోలీసులు దాడులు చేయడం దారుణమని, ఇది దేశ భవిష్యత్తుకు ముప్పు అని మండిపడ్డారు. దేశంలో విద్యార్థులకు ఆపర్చునిటీస్ లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.


