ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్

TG: ‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు..కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు’ అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ 'రైతు సదస్సు'లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు, కరెంటు కోతలు, సాగునీటి సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ తరఫున రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.



