← Back to news

అసైన్డ్ భూములకు అక్రమ పట్టాలు.. అధికారిణిపై వేటు

By DK· 9 Jul 2026
అసైన్డ్ భూములకు అక్రమ పట్టాలు.. అధికారిణిపై వేటు

TG: ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లొసుగులను ఆసరగా చేసుకుని ప్రభుత్వ భూములను అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసిన కుంభకోణాలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో 448 ఎకరాల అసైన్డ్‌ భూములను పట్టా చేసినట్లు సిట్ విచారణలో తేలింది. తహసీల్దార్‌ దండు సుజాత కనీసం క్రాస్‌చెక్‌ చేసుకోకుండా, ఎలాంటి సపోర్టింగ్‌ డాక్యుమెంట్లు లేకుండా పట్టామార్పిడి చేసినట్లు గుర్తించారు. దీంతో తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ కె.హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 18h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.