అసైన్డ్ భూములకు అక్రమ పట్టాలు.. అధికారిణిపై వేటు

TG: ధరణి పోర్టల్లోని సాంకేతిక లొసుగులను ఆసరగా చేసుకుని ప్రభుత్వ భూములను అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసిన కుంభకోణాలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో 448 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా చేసినట్లు సిట్ విచారణలో తేలింది. తహసీల్దార్ దండు సుజాత కనీసం క్రాస్చెక్ చేసుకోకుండా, ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేకుండా పట్టామార్పిడి చేసినట్లు గుర్తించారు. దీంతో తహసీల్దార్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు.



