నేను ఆరోజు బ్రోతల్ కీపర్ గా వెళ్లా- సుమతి

పోకిరీల ఆట కట్టించడానికి అర్ధరాత్రి స్టింగ్ ఆపరేషన్ చేసిన మల్కాజ్ గిరి ఐపీఎస్ సుమతి తాను ఆరోజు బ్రోతల్ కీపర్ గా వెళ్లినట్లు తెలిపారు. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ లో అసాంఘీక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు వెళ్లిన తాను రెండు గంటలు 40 మంది పోకిరీలతో నానా ఇబ్బందులు పడ్డానన్నారు. తాను అమ్మాయిల సప్లయర్ గా వారికి చెప్పగా ఒకడు అప్పటికప్పుడు వాళ్ల దగ్గరకు తీసుకెళ్లమని వత్తిడి చేశాడని రెండు గంటలు చాలా ఇబ్బంది పడినట్లు సుమతి వివరించారు.



