ఢిల్లీ బస్సులో మహిళ గ్యాంగ్ రేప్.. నిందితుల అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 30 ఏళ్ల మహిళపై కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారం జరిగింది. బస్సులో డ్రైవర్, కండక్టర్ కలిసి ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నంగ్లోయ్ దగ్గర ఆమెను బస్సు నుంచి దింపేసి పరారయ్యారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో మరోసారి మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.



