AP

రూ.15 కోట్ల దేవాలయ భూమి కబ్జా
AP· 14 Jul 2026

రూ.15 కోట్ల దేవాలయ భూమి కబ్జా

AP: మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని శివాలయం వద్దనున్న బ్రహ్మంగారి గుడి స్థలాన్ని కొందరు ఆక్రమించారని పొదిలికి చెందిన ఆకుపాటి లక్ష్మణ అనే భక్తుడు ఆరోపించారు. ఆలయ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆయన ఫిర్యాదు చేశాడు. స్దానిక అధికారులకు పలుసార్లు ఫిర్యాదులు చేసినా ఎవ్వరు పట్టించుకోలేదని ఆయన ఆరొపించాడు. దాదాపు రూ.15 కోట్ల విలువైన ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి కోట్ల విలువైన స్దలాన్ని భూకబ్జదారుల నుంచి కాపాడాలని ఆయన కోరారు.

మార్చి 31 నాటికి పోలవరం పనులు పూర్తిచేస్తాం
AP· 14 Jul 2026

మార్చి 31 నాటికి పోలవరం పనులు పూర్తిచేస్తాం

APకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు 89శాతం పనులు పూర్తి అయ్యాయని, తొలిదశ పనులన్నీ వచ్చే మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేస్తామని CM చంద్రబాబు స్పష్టంచేశారు. పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రస్తుతం 89శాతం పనులు పూర్తయ్యాయి. అనుకున్న టైమ్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని, స్పిల్ వే రేడియల్ గేట్స్, కాఫర్ డ్యామ్ సహా పలు పనులు పూర్తయ్యాయన్నారు. 2027 మార్చి నాటికి మిగతా అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. తాను ఇప్పటికి 37సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించానని, 136 సార్లు వర్చువల్‌గా సమీక్షించానని గుర్తుచేశారు.

మెకానిక్ షెడ్డులో మంటలు
AP· 12 Jul 2026

మెకానిక్ షెడ్డులో మంటలు

AP: విజయవాడ ఆటోనగర్‌లోని మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే షెడ్ మొత్తం వ్యాపించి మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన పలు ప్రైవేట్ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. దీంతో స్థానికులు, వాహనదారులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బ్యాటరీ టెర్మినల్స్ వద్ద లేదా షెడ్డులోని వైరింగ్‌లో సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కారు బీభత్సం.. వాహనాలపై దూసుకెళ్లిన కారు
AP· 12 Jul 2026

కారు బీభత్సం.. వాహనాలపై దూసుకెళ్లిన కారు

AP: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు చెత్త సేకరించే వాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా సైకిల్‌పై వెళ్తున్న AR కానిస్టేబుల్‌ను, అనంతరం బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కానిస్టేబుల్ మరియదాస్ ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారును ఓ వైద్య విద్యార్థిని నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏఆర్ కానిస్టేబుల్ మృతిపై హోంమంత్రి అనిత సంతాపం వ్యక్తం చేశారు.