Crime· 26 Jun 2026
టూర్ పేరుతో గంజాయి స్మగ్లింగ్.. స్టూడెంట్స్ అరెస్ట్
TG: సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఐదుగురు యువకులు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బీటెక్ , బీ ఫార్మసీ, ఇంటర్మీడియట్ చదువుతున్న ఐదుగురు స్నేహితులు పర్యాటకం మాటున వెళుతూ గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద 16కిలోల గంజాయి డ్రైపొడిని పట్టుకున్నారు. ఒడిస్సా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతం నుంచి తెలంగాణలోని కోదాడకు తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు కోదాడ ప్రాంతానికి చెందిన షేక్ నజీర్, షేక్ అస్వక్, మహమ్మద్ హఫీజ్ఖాన్, తమ్మిశెట్టి దుర్గాప్రసాద్, తమ్మిశెట్టి పెద్దిరాజుగా గుర్తించారు.