Crime

ATM క్యాష్ దోపిడీలో షాకింగ్ ట్విస్ట్.. డ్రైవరే దొంగ
Crime· 25 Jun 2026

ATM క్యాష్ దోపిడీలో షాకింగ్ ట్విస్ట్.. డ్రైవరే దొంగ

TG: హైదరాబాద్ IS సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ATM క్యాష్ దోపిడీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్ తన కుమారుడితో కలిసి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న సంతోష్‌నగర్ SBI ATMలో కస్టోడియన్లు, గన్‌మెన్ నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్లగా, వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్ రూ.17లక్షలు ఉన్న బ్యాగ్‌తో పరారయ్యాడు. డ్రైవర్ శ్రీనివాస్ కనిపించకపోవడం, బ్యాగ్ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. CC కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, బైక్‌పై వెళ్ళింది తండ్రి కొడుకులుగా నిర్ధారించారు.

గూగుల్‌లో 'హత్య' పాఠాలు!
Crime· 25 Jun 2026

గూగుల్‌లో 'హత్య' పాఠాలు!

పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరీలను విచారించగా.. కేతన్‌ను ఎలా చంపాలో చాలా రోజుల ముందు నుంచే ఆన్‌లైన్‌లో రకరకాలుగా సెర్చ్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. పక్కా ప్లాన్‌తో జూన్ 18న లోహగడ్ కోట వద్ద కేతన్‌ను లోయలోకి తోసి చంపేశారు. అంతేకాదు, వీరిద్దరూ గత 6 నెలల్లో ఏకంగా 2004 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడుకుని, 238 గంటల పాటు మర్డర్ ప్లాన్ గురించే డిస్కస్ చేసినట్లు డిజిటల్ ఆధారాల ద్వారా తేలింది. ఈ డిజిటల్ ఫుట్‌ప్రింట్, సెర్చ్ హిస్టరీనే ఇప్పుడు నిందితులను బుక్ చేసింది.

నల్గొండ హత్య కేసులో ట్విస్ట్.. కూతురే సుపారీ ఇచ్చి చంపించింది
Crime· 25 Jun 2026

నల్గొండ హత్య కేసులో ట్విస్ట్.. కూతురే సుపారీ ఇచ్చి చంపించింది

TG: నల్గొండలోని తెలంగాణ కాలనీలో భార్యాభర్తలు సుల్తాన్(45), హసీనా(40), కొడుకు ముజామిల్ (21), కూతురు అక్సర (11) లు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆత్మహత్యా? హత్యా? అనేక అనుమానాల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురి హత్య కేసులో సుపారీ హత్య చేయించింది కూతురేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య జరిగిన ఇల్లు మృతురాలు హసీనాకు చెందినది. సుల్తాన్‌తో పెళ్లి కాకముందే హసీనా ఈ ఇంటిని నిర్మించుకుంది. ఆస్తిని దక్కించుకోవాలనే దురాశతో హసీనా మొదటి భర్త కూతురు బుషా బుటానీ సుఫారీ హత్య చేయించినట్లు గుర్తించారు.

మూడు పెళ్లిళ్ల ట్రాప్.. రైల్వే ఉద్యోగి సూసైడ్
Crime· 25 Jun 2026

మూడు పెళ్లిళ్ల ట్రాప్.. రైల్వే ఉద్యోగి సూసైడ్

AP: తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన రవి రైల్వే ఉద్యోగి. మహిళా సంఘం నాయకురాలిగా చలామణి అవుతున్న ఉషారాణి మ్యాట్రిమోని సైట్ ద్వారా రవికి పరిచయమైంది. మాయమాటలతో రవిని ట్రాప్ చేసి మూడేళ్లుగా అతనితో సహజీవనం సాగించింది. రవి రైల్వే రికార్డులో, అతని రూ.1కోటి ఇన్సూరెన్స్ పాలసీకి నామినిగా పెట్టాలని ఆమె ఒత్తిడి చేసింది. రవి రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెకు మూడు పెళ్లిళ్లు అయినట్లు గుర్తించారు. మహిళా సంఘం, CPI నాయకులతో మాట్లాడి రాజీ చేసుకోవాలని పోలీసులు రవికి చెప్పినట్లు సమాచారం. తనకు న్యాయం జరగలేదని రవి సూసైడ్ చేసుకున్నాడు.

రూ.158 కోట్ల భారీ రైస్‌మిల్ కుంభకోణం గుట్టురట్టు
Crime· 24 Jun 2026

రూ.158 కోట్ల భారీ రైస్‌మిల్ కుంభకోణం గుట్టురట్టు

TG: కరీంనగర్ కట్టరాంపూర్ భగత్‌నగర్‌కు చెందిన సౌభాగ్య లక్ష్మి రైస్ ఇండస్ట్రీస్ మేనేజర్ బండారి మారుతి, పార్ట్‌నర్ అంజయ్య వీరిద్దరూ పౌరసరపరాల జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్‌తో CMR ధాన్యం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రభుత్వానికి 2023 సంవత్సరంలో ఇవ్వాల్సిన 3116.360 మెట్రిక్ టన్నులు, 2024లో 2119.125 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ విక్రయాలకు పాల్పడి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.158కోట్ల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించినట్లు పోలీసులు నిర్ధారించారు.

హత్య చేసి ఆపై అంత్యక్రియల్లో పాల్గొని
Crime· 24 Jun 2026

హత్య చేసి ఆపై అంత్యక్రియల్లో పాల్గొని

TG: మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన వృద్ధురాలు దోమకొండ సాయవ్వ ఈనెల 17న అనారోగ్యంతో మృతి చెందిందని అంత్యక్రియలు చేశారు. ఆమె మెడపై గాయం కనిపించడం, బంగారం కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయవ్వ రెండో కుమార్తె లక్ష్మి పెద్ద కుమారుడు విశాల్‌పై అనుమానం రాగా, అతడిని విచారించారు. అతడు హత్య చేసినట్లు అంగీకరించాడు. విశాల్, తన ఫ్రెండ్ ప్రశాంత్‌తో కలిసి సాయవ్వకు గొంతు నులిపి హత్య చేశారు. బంగారు ఉంగరం, చెవికమ్మలు, రూ.7,000 తీసుకొని హైదరాబాద్ పారిపోయారు. తర్వాత అమ్మమ్మ అంత్యక్రియల్లోనూ పాల్గొన్నట్లు CI సైదా తెలిపారు.

మత్తు ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ మృతి
Crime· 24 Jun 2026

మత్తు ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ మృతి

TG: APలోని విశాఖపట్నానికి చెందిన మొహ్మద్ ఇమాయతుల్లా, అతని కుమారుడు ఖాసిం (27) HYD పాతబస్తీలోని యాకుత్‌పురాలో నివాసముంటున్నారు. డాక్టర్ ఖాసీం మల్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీ చేస్తున్నాడు. రాత్రి విశ్రాంతికని ఆసుపత్రిలోని తన గదిలోకెళ్లి గడియపెట్టుకున్నాడు. ఖాసీం ఎంతసేపటికీ బయటకు రావడం లేదని ఆసుపత్రి సిబ్బంది తలుపులు విరగ్గొట్టారు. అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. తనకు నిద్ర పట్టడం లేదని ఖాసిం చెప్పేవారని ఆయన తండ్రి పోలీసులకు తెలిపారు. నిద్ర కోసం మాత్రలతోపాటు మత్తు ఇంజెక్షన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

నలుగురు దారుణ హత్య... వీడని మిస్టరీ
Crime· 24 Jun 2026

నలుగురు దారుణ హత్య... వీడని మిస్టరీ

TG: నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో నలుగురు కుటుంబసభ్యులు దారుణ హత్య మిస్టరీ వీడడం లేదు. నాలుగు హత్యలు ప్లాన్ ప్రకారమే జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. నలుగురి హత్యలకు సంబంధించి ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. తండ్రి సుల్తాన్‌కు ఆరు కత్తిపోట్లు, కుమారుడు ముజామ్మిల్‌కు 12, హసీనాకు 8, కూతురు అప్సర్‌ శరీరంపై తొమ్మిది కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కానీ హత్యలకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన ఆనవాళ్లు సేకరించడం పోలీసులకు సవాల్‌గా మారింది.