Crime· 24 Jun 2026
హత్య చేసి ఆపై అంత్యక్రియల్లో పాల్గొని
TG: మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన వృద్ధురాలు దోమకొండ సాయవ్వ ఈనెల 17న అనారోగ్యంతో మృతి చెందిందని అంత్యక్రియలు చేశారు. ఆమె మెడపై గాయం కనిపించడం, బంగారం కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయవ్వ రెండో కుమార్తె లక్ష్మి పెద్ద కుమారుడు విశాల్పై అనుమానం రాగా, అతడిని విచారించారు. అతడు హత్య చేసినట్లు అంగీకరించాడు. విశాల్, తన ఫ్రెండ్ ప్రశాంత్తో కలిసి సాయవ్వకు గొంతు నులిపి హత్య చేశారు. బంగారు ఉంగరం, చెవికమ్మలు, రూ.7,000 తీసుకొని హైదరాబాద్ పారిపోయారు. తర్వాత అమ్మమ్మ అంత్యక్రియల్లోనూ పాల్గొన్నట్లు CI సైదా తెలిపారు.