Crime· 10 Jun 2026
గంజాయి ముఠా రాళ్లదాడి.. గాల్లోకి కాల్పులు
AP: అల్లూరిసీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని లోతుగెడ్డ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయితో వస్తున్న కారును తనిఖీ చేస్తుండగా అందులో ఉన్న ముఠా సభ్యులు హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులపై రాళ్లతో దాడిచేశారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, నలుగురిని పట్టుకున్నారు. నిందితులు ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్కు చెందిన వారిగా గుర్తించారు. 290కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.