Crime

ఆడిట్‌లో దొరికిపోతానని ఆత్మహత్య
Crime· 12 Jun 2026

ఆడిట్‌లో దొరికిపోతానని ఆత్మహత్య

TG: రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఉద్యోగిగా పనిచేసిన శ్రీధర్‌బాబు ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫస్ట్ అతనిది సాధారణ ఆత్మహత్యగా భావించినా కేసు దర్యాప్తులో భారీ ఆర్థిక అక్రమాలు బయటపడ్డాయి. జిల్లా ట్రైబల్ శాఖకు సంబంధించిన నిధులను అక్రమంగా ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ట్రైబల్ అధికారిణి సంతకాలను శ్రీధర్ బాబు ఫోర్జరీ చేసి రూ.33 లక్షల ప్రభుత్వ నిధులు స్వాహా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం ఆడిట్‌లో బయటపడే అవకాశం ఉండటంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

తప్పుడు లెక్కలు సృష్టించి.. 3.61 కోట్లు స్వాహా
Crime· 12 Jun 2026

తప్పుడు లెక్కలు సృష్టించి.. 3.61 కోట్లు స్వాహా

AP: అనంతపురం జిల్లాలో నిర్వహించిన ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగాయి. జిల్లాలోని 31 మండలాల పరిధిలో చేయని పనులకు బిల్లులు చెల్లించడం, తప్పుడు పేర్లు నమోదు చేయడం, పనికి రాకున్నా మరొకరి పేర్లతో కూలి వేతనాలు చెల్లించడం, వంటి అనేక రూపాల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది జరిగిన ఉపాధి పనుల్లో రూ. 3.61 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితరులు అక్రమాలకు పాల్పడిన వారిలో ఉన్నారు. రికవరీ కోసం విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు.

బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుశిక్ష
Crime· 11 Jun 2026

బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుశిక్ష

TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దూరాజిపల్లి గ్రామంలోని తెళ్లబండ కాలనీకి చెందిన రాపాణి శ్రీనుపై ఓ గొడవ కేసులో చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సత్ప్రవర్తనతో మెలుగుతానని మండల మేజిస్ట్రేట్ వద్ద రూ.3లక్షల పూచీకత్తుతో బైండోవర్ చేసుకున్నాడు. అయితే శ్రీను బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి తిరిగి నేరానికి పాల్పడ్డాడు. ఈ మేరకు చివ్వెంల పోలీసులు మరో కేసు నమోదు చేసి అతడిని మండల న్యాయవాది ముందు హాజరుపరిచారు. పూచీకత్తు మొత్తం రూ.3లక్షల జరిమానా విధించగా, చెల్లించలేకపోవడంతో తహశీల్దార్ ఉత్తర్వుల మేరకు 45రోజులు జైలుకు తరలించారు.

హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఆరుగురు దొరికేశారు!
Crime· 11 Jun 2026

హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఆరుగురు దొరికేశారు!

హైదరాబాద్‌లో క్యూనెట్ పేరుతో జరిగిన ఒక పెద్ద మోసాన్ని CCS పోలీసులు పట్టుకుని, ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ మెయిన్‌గా జాబ్స్ లేని వాళ్లని, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్‌ని టార్గెట్ చేసింది. కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తే కోట్లు సంపాదించవచ్చని నమ్మించి, ఒక్కొక్కరి దగ్గర ₹5 లక్షల నుండి ₹10 లక్షల వరకు వసూలు చేశారు. వాళ్ల దగ్గర ఉన్న ల్యాప్‌టాప్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్‌ని పోలీసులు సీజ్ చేశారు. ఈ స్కామ్ ఫుల్ డీటెయిల్స్‌ని బంజారాహిల్స్ ICCC ఆఫీస్‌లో జరిగే ప్రెస్‌మీట్‌లో, హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి చెప్పబోతున్నారు.

ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య
Crime· 11 Jun 2026

ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య

TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం మర్కల్‌ గ్రామానికి చెందిన కంచర్ల రాజయ్య (45), రేణుక దంపతులు. రేణుకకు గంగాశేఖర్‌ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. అడ్డుగా ఉన్న రాజయ్యను తొలగించుకోవాలని, అంతేకాకుండా రాజయ్య చనిపోతే ఆయన పేరు మీదున్న ఇన్సూరెన్స్ సొమ్ము తమకే దక్కుతుందని ప్లాన్ వేశారు. రేణుక, గంగాశేఖర్ పథకం ప్రకారం రాజయ్యకు మద్యం తాగించి ఐరన్ రాడ్‌తో కొట్టి హత్యచేశారు. అనుమానం రాకుండా రోడ్ యాక్సిడెంట్‌గా చిత్రీకరించారు. నేరం అంగీకరించడంతో నిందితులు రేణుక, గంగాశేఖర్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.