Crime· 8 Jun 2026
దొరికిన కాడికి దోచి.. చెరువులో చేపలు లూటీ
TG: మృగశిర కార్తె సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని పలు గ్రామాలు, గిరిజన తండా వాసులు పెద్దఎత్తున కురవి పెద్దచెరువు వద్దకు తరలివచ్చారు. చెరువులో చేపల వేటకు దిగారు. భారీగా వలలు, గాలాలు వేసి చేపలను పట్టుకున్నారు. వలలు లేని వారు.. చీరలు, లుంగీలలో దొరికిన కాడికి చేపలను దోచుకున్నారు. విషయం సొసైటీ సభ్యులకు తెలియడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి వారిని చెదరగొట్టారు. చెరువు వద్ద ఉంచిన 60బైక్లను, వలలు సీజ్ చేసి 14మందిని అరెస్ట్ చేశారు.