Local· 10h ago
కామారెడ్డిలో అంబేద్కర్ భవన్.. బోర్డు పెట్టేశారు!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం కోసం సైట్ ఫిక్స్ అయింది. రెండు ఎకరాల స్థలంలో బోర్డు పెట్టే ఈవెంట్ జరిగింది. జిల్లా DSDO వెంకటేశ్వర్, అంబేద్కర్ యువజన సంఘం నేతలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు కోత్తోల్ల గంగారాం, సెక్రెటరీ గైని రాజు హాజరయ్యారు. గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, నీరడి సంగమేశ్వర్, ధ్యామని భూపతి, లేగ్గల రాజు, గడ్డం రవి పాల్గొన్నారు. భవన నిర్మాణానికి ఇది మొదటి అడుగని, శరవేగంగా అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తవుతుందని నేతలు చెబుతున్నారు.