Local

వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: ఎమ్మార్పీఎస్
Local· 28 Aug 2026

వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: ఎమ్మార్పీఎస్

TG: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్‌లో వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి బుర్రి సతీష్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయవద్దని సూచించారు.

నీళ్లు విడుదలైనా పొలాలకు చేరడం లేదు.. రైతుల ఆవేదన
Local· 28 Aug 2026

నీళ్లు విడుదలైనా పొలాలకు చేరడం లేదు.. రైతుల ఆవేదన

TG: జోగులాంబగద్వాల జిల్లాలో RDS (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కెనాల్‌ దుస్థితి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కెనాల్‌కు సాగునీరు విడుదల చేసినా కాలువలో నీరు సక్రమంగా ప్రవహించి పొలాలకు చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనాల్‌ కంపచెట్లు, ముళ్లపొదలతో నిండిపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. పలుచోట్ల లైనింగ్‌ దెబ్బతిని పెచ్చులూడిపోవడంతో నీరు లీకై వృథాగా పోయే ప్రమాదం ఉందన్నారు. సాగు సమయంలో నీరు సక్రమంగా అందకపోతే పంటలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.