Local· 28 Aug 2026
ఆకట్టుకున్న వృక్ష రక్షాబంధన్
వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ సందర్భంగా వృక్ష రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ హరిత దళ క్లబ్(ఎన్జీసీ), జూనియర్ రెడ్ క్రాస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలోని మొక్కలకు రాఖీలు కట్టి వాటిని సోదరీమణుల్లా సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ టి.హేమారావు, ఎస్ఎంసి చైర్మన్ బి.లక్ష్మిపతి, కొయ్యల శ్రీనివాసరావు, ఎన్.మంగరాజు పాల్గొన్నారు.