Local· 28 Aug 2026
గురజాల ఓటర్ల జాబితాపై అప్డేట్.. 44వేల మందికి నోటీసులు
AP: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓటరు జాబితా సర్వేలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయని ఆర్డీవో మురళీకృష్ణ తెలిపారు. గతంలో 2,75,012 మంది ఓటర్లు ఉండగా, సర్వే అనంతరం ప్రస్తుతం 2,41,254 మంది ఉన్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా 304 నుంచి 328కి పెరిగిందన్నారు. ఇప్పటివరకు 44,511 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాని వారు 7,081 మంది ఉన్నారని చెప్పారు.