Local· 28 Aug 2026
మహిళా నాయకుల ఆత్మీయతకు ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలు
నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవికి మహిళా నాయకులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ మల్లు రవి మహిళలతో సోదరభావంతో మమేకమై ఆప్యాయంగా మాట్లాడారు. మహిళల గౌరవం, భద్రత, సాధికారతకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. రక్షాబంధన్ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, నమ్మకం, బాధ్యతలకు ప్రతీక అని పేర్కొన్నారు.