National· 18 Aug 2026
మళ్లీ వర్షాలు గట్టిగానే పడబోతున్నాయా?
ఇటీవల వర్షాలు కాస్త తగ్గడంతో “ఇక తగ్గిపోయినట్టే!” అనుకుంటున్నారా? మళ్లీ మాన్సూన్ యాక్టివ్ అవుతోంది. ఆగస్టు 20 నుంచి 24 వరకు తూర్పు, మధ్య భారతంలో వర్షాలు బాగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా జార్ఖండ్, బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు పడొచ్చు. జార్ఖండ్లో కొన్ని ప్రాంతాల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీటిముంపు, వరదలు, రోడ్లపై రాకపోకలకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.