National· 18 Aug 2026
GenZ ఎఫెక్ట్.. 1.95 లక్షల పోస్ట్లు బ్లాక్!
విద్యార్థుల నిరసనలు ఊపందుకోవడంతో ప్రభుత్వం సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం, ప్రభుత్వం దాదాపు 1.95 లక్షల బ్లాకింగ్ ఆర్డర్లను జారీ చేయగా.. ఇందులో ఒక్క ఇన్స్టాగ్రామ్లోనే అత్యధికంగా 1,00,000 పోస్ట్లపై చర్యలు తీసుకున్నారు. అలాగే ఫేస్బుక్లో 80,000, యూట్యూబ్లో 15,000 ఆర్డర్లు అమలయ్యాయి. హోం మంత్రిత్వ శాఖ 'సహయోగ్' పోర్టల్ ద్వారా హ్యూమన్ రివ్యూ లేకుండానే ఈ పోస్ట్లు ఆటోమేటిక్గా డిలీట్ అయ్యాయి.