TG

అర్ధరాత్రి మిల్లులో మంటలు.. స్థానికుల్లో టెన్షన్
TG· 3 Jul 2026

అర్ధరాత్రి మిల్లులో మంటలు.. స్థానికుల్లో టెన్షన్

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో పత్తిగింజల బస్తాలు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మిల్లులో నిల్వ చేసిన పత్తిగింజల బస్తాలకు ఇరువైపులా వడ్ల బస్తాలు ఉన్నప్పటికీ వాటికి పెద్దగా నష్టం జరగకపోవడం, మధ్యలోని పత్తిగింజల బస్తాలకే మంటలు వ్యాపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొంత ఆలస్యమై ఉంటే మంటలు పక్కనే ఉన్న వడ్ల బస్తాలకు వ్యాపించి భారీ ఆస్తి నష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రం కొత్త స్కీమ్‌పై తెలంగాణ క్యాబినెట్ ఫైర్
TG· 3 Jul 2026

కేంద్రం కొత్త స్కీమ్‌పై తెలంగాణ క్యాబినెట్ ఫైర్

TG: రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం తెచ్చిన VB G రాంజీ చట్టంలో పలు నిబంధనలపై క్యాబినెట్ నిరసన తెలిపినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంపై ఆర్థిక భారం మోపేలా, ఏకపక్షంగా VB G రాంజీని అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు భిన్నంగా, ప్రజలు, కూలీల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉపాధి హామీ పథకం పేరును మార్చి VB G రాంజీ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చిందని ఫైరయ్యారు. కొత్త చట్టంలోని నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు.

KTRను కలిసిన జెన్-జీ యువతులు
TG· 1 Jul 2026

KTRను కలిసిన జెన్-జీ యువతులు

TG: రాజకీయాలపై మక్కువతో, సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్న నలుగురు జెన్ జీ యువతులు KTRను కలిశారు. ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న నలుగురు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి మాట్లాడారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో చదవనున్న సరయు, నల్సార్ లా యూనివర్సిటీకి చెందిన లాస్య, సింబయాసిస్ లా స్కూల్ విద్యార్థిని రేవతి, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీకి చెందిన అశ్విని.. తాము భవిష్యత్తులో రాజకీయ నేతలుగా ఎదగాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. సమాజంలో మార్పు కోసం నలుగురు ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలనుకోవడంపై KTR అభినందించారు.

ORR పై కాల్పుల కలకలం
TG· 1 Jul 2026

ORR పై కాల్పుల కలకలం

TG: హైదరాబాద్ నగర శివారులోని ORRపై కాల్పుల ఘటన కలకలం రేపింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీకాంత్ తన అనుచరులతో కలిసి రంగారెడ్డి జిల్లా బొంగులూరు గేట్ ఎగ్జిట్ నంబర్-12 వద్ద ఒక DCM వాహనంలో ఉన్నట్లు రికార్డు అయింది. నల్గొండ జిల్లా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు శ్రీకాంత్‌ను పట్టుకునేందుకు వెళ్లగా, నిందితులు లొంగిపోవడానికి బదులుగా పోలీసులపై కత్తులతో దాడిచేశారు. ఒక CCS హెడ్ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. ఆత్మరక్షణ కోసం గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నిందితులను హెచ్చరించారు. అయినప్పటికీ వినకపోవడంతో శ్రీకాంత్ కాళ్లపై కాల్పులు జరిపి వారిని అరెస్ట్ చేశారు.

థర్మల్ పవర్ యూనిట్‌ను మూసేసిన తెలంగాణ ప్రభుత్వం
TG· 30 Jun 2026

థర్మల్ పవర్ యూనిట్‌ను మూసేసిన తెలంగాణ ప్రభుత్వం

TG: రాష్ట్రంలో బొగ్గు కొరత నేపథ్యంలో జెన్‌కో సన్సెషనల్ డిసిషన్ తీసుకుంది. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో రెండు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లను మూసివేసింది. యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (YTPS)లో ఒక యూనిట్‌, కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(KTPS)లో మరో యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసింది. ఇలా రెండు యూనిట్లను మూసివేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. సింగరేణి నుంచి జెన్‌కో యూనిట్లకు బొగ్గు సరఫరా తగ్గిపోవడమే ఇందుకు కారణం. అయితే బొగ్గు సరఫరాకు సంబంధించి చెల్లింపులు సకాలంలో చేయకపోవడంతోనే సింగరేణి సంస్థ సరఫరాను తగ్గించింది.

బంగారం దొరికిన పొలంపై కొత్త ట్విస్ట్
TG· 30 Jun 2026

బంగారం దొరికిన పొలంపై కొత్త ట్విస్ట్

TG: వరంగల్ జిల్లా కోపాకులపాడులోని వ్యవసాయ భూమిలో బంగారు నగలు దొరకడం హాట్ టాఫిక్‌గా మారింది. ఈ భూమిని పదేళ్ల క్రితం చెన్నారావుపేటకు చెందిన ఓ వ్యక్తి, కోపాకులపాడుకి చెందిన రైతు నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ భూమిని ఈర్యతండాకు చెందిన ఒక రైతు కౌలుకు తీసుకుని పత్తిసాగు చేస్తున్నాడు. గతంలో ఇక్కడ గుప్తనిధులు లభ్యమైనట్లు స్థానికులు చెపుతున్నారు. గతంలో ఈ భూమిని విక్రయించిన పాత యజమాని కుమారుడు PSలో ఫిర్యాదు చేశారు. తమ తాతలకాలం నాటి భూమిలో దొరికిన బంగారాన్ని తమకు అప్పగించాలని కోరారు. ప్రస్తుత యజమాని కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం.

పొలంలో బంగారు నగలు.. రాత్రంతా తవ్వకాలు
TG· 30 Jun 2026

పొలంలో బంగారు నగలు.. రాత్రంతా తవ్వకాలు

TG: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకోవడానికి జనం పోటీ పడుతున్నారు. మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలని యజమానిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంత డిమాండ్ ఎందుకంటే ఈ భూమిని కౌలుకు చేసిన రైతుకు బంగారు నగలు దొరికాయి. ఓ కౌలు రైతు ఆ భూమిలో పత్తి సాగు చేస్తున్నాడు. ఈ నెల 24న కలుపు తీయిస్తుండగా కూలీలకు బంగారు ఆభరణాలు దొరికినట్లు ప్రచారం జరిగింది. యజమాని కూలీలను పిలిచి అడిగితే, వాళ్లు బంగారం చూపించారు. దీనిపై యజమాని PSలో ఫిర్యాదు చేశారు. బంగారం ప్రచారంతో రాత్రి వేళల్లో చుట్టుపక్కల గ్రామాల వారు పొలాల్లో తవ్వకాలు చేపడుతున్నారు.

ఆస్తి కోసం తండ్రినే నమ్మించి మోసం చేశారు
TG· 30 Jun 2026

ఆస్తి కోసం తండ్రినే నమ్మించి మోసం చేశారు

TG: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (S) మండలం మిడతనపల్లి గ్రామానికి చెందిన ఏనిగ ఎల్లారెడ్డికి వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిపైనే ఆయన ఆధారపడి జీవిస్తున్నాడు. ఎల్లారెడ్డికి ముగ్గురు కూతుర్లు పాశం లక్ష్మమ్మ, చిదుముల్ల మల్లేశ్వరి, కుంట్ల సునీత తమ భర్తలతో కలిసి తండ్రిని నూతనకల్ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. వృద్ధాప్య రక్షణ కల్పిస్తామని నమ్మించి ఆయనకు తెలియకుండానే సంతకాలు చేయించుకుని భూమిని తమ పేర్లపై మార్పిడి చేసుకున్నట్లు ఎల్లారెడ్డి ఆరోపించారు. కన్నకూతుర్లే తనను మోసం చేశారని, తిరిగి నా పేరిట పాస్‌బుక్ ఇప్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.

భట్టి బిగ్ అనౌన్స్‌మెంట్.. ఉద్యోగులకు రిలీఫ్
TG· 30 Jun 2026

భట్టి బిగ్ అనౌన్స్‌మెంట్.. ఉద్యోగులకు రిలీఫ్

TG: ఉద్యోగులు, పింఛన్‌దారుల బకాయిల చెల్లింపుల కోసం మరో రూ.2 వేల కోట్లను విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత నెలలో మొదటి విడతగా రూ.2 వేల కోట్లు విడుదల చేయగా, తాజాగా మరో రూ.2 వేల కోట్లను విడుదల చేసినట్లు, దీంతో రూ.4వేల కోట్ల చెల్లింపు పూర్తియిందని భట్టి స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, అందులో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించి చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPS) బకాయిలను వందశాతం చెల్లించామన్నారు.

గుత్తా ఫొటో మిస్సింగ్.. నల్గొండలో ప్రోటోకాల్ రచ్చ
TG· 28 Jun 2026

గుత్తా ఫొటో మిస్సింగ్.. నల్గొండలో ప్రోటోకాల్ రచ్చ

TG: CM రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన రసాభాసగా మారింది. సీఎం సభ సందర్భంగా R&B శాఖ ఇచ్చిన పత్రికా ప్రకటనలో శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రోటోకాల్ పాటించలేదని సంబంధిత అధికారులకు గుత్తా సుఖేందర్ రెడ్డి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు సభకు రావొద్దంటూ DCC అధ్యక్షుడు కైలాష్ నేతను మంత్రి కోమటిరెడ్డి వర్గం నాయకులు హెచ్చరించారు. తనకు ఆహ్వానం అందలేదని, అయినా సభకు హాజరవుతానని కైలాష్ సవాల్ చేశారు. దీంతో కైలాష్ నేతను, ఆయన వర్గాన్ని అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం.