TG· 30 Jun 2026
భట్టి బిగ్ అనౌన్స్మెంట్.. ఉద్యోగులకు రిలీఫ్
TG: ఉద్యోగులు, పింఛన్దారుల బకాయిల చెల్లింపుల కోసం మరో రూ.2 వేల కోట్లను విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత నెలలో మొదటి విడతగా రూ.2 వేల కోట్లు విడుదల చేయగా, తాజాగా మరో రూ.2 వేల కోట్లను విడుదల చేసినట్లు, దీంతో రూ.4వేల కోట్ల చెల్లింపు పూర్తియిందని భట్టి స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, అందులో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించి చాలాకాలంగా పెండింగ్లో ఉన్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPS) బకాయిలను వందశాతం చెల్లించామన్నారు.