Latest

దర్శిగుంటపేటలో మహిళ దారుణహత్య.. ప్రజల ఆందోళన
AP: మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురం మండలం దర్శిగుంటపేటలో ఈనెల 13న బంగారం కోసం ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల దర్యాప్తులో బంగారం కోసమే ఈ హత్య జరిగినట్లు నిర్ధారణ అయింది. మృతురాలు ధరించిన బంగారు నగలను దుండగులు తీసుకెళ్లారు. పోస్టుమార్టం నివేదికలో గొడ్డలితో తలపై దాడి చేయడం వల్ల తీవ్ర గాయం కావడంతో ఆమె మృతి చెందినట్లు తేలింది. హత్య జరిగి నాలుగు రోజులైనా నిందితులను ఇంకా పట్టుకోకపోవడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామంలో పోలీసు భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

462 రన్స్ కి ఆలౌట్.. అయినా ఇండియాదే పైచేయి!
ఇండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ 3వ రోజున టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 462 రన్స్కి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్లో ఇండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 రన్స్తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమ్కి టాప్ స్కోరర్గా నిలిచాడు. సోమవారం నాటి ఆటలో శ్రీలంక బౌలర్లు మిగతా వికెట్లను త్వరగా పడగొట్టి కమ్బ్యాక్ చేశారు. అయినప్పటికీ, పడిక్కల్ సెంచరీ హెల్ప్తో ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్పై ఫుల్ కంట్రోల్ సాధించి, శ్రీలంకపై మంచి ఆధిక్యంలో నిలిచింది.

మీ కంప్యూటర్ టేబుల్ను రెట్రో స్టైల్లోకి మార్చుకోండి ఇలా!
మీ కంప్యూటర్ టేబుల్ని పాతకాలపు (రెట్రో) శైలిలో కూల్గా మార్చుకోవడం చాలా ఈజీ. టైప్రైటర్ మోడల్లో ఉండే మెకానికల్ కీబోర్డ్ వాడితే మీ వర్క్స్పేస్కి ఒక క్లాసిక్ లుక్ వస్తుంది. పాత గేమ్స్, పిక్సెల్ ఆర్ట్ లేదా పాత ఓఎస్ డిజైన్లలో ఉండే వాల్పేపర్లను కంప్యూటర్ స్క్రీన్పై పెట్టుకోవచ్చు. డెస్క్ లుక్ పెంచడానికి పాత ఫ్లాపీ డిస్క్లు, ఆడియో క్యాసెట్ టేప్లు, పాత కెమెరాలు లాంటివి డెకరేషన్గా పెట్టుకోవచ్చు. వెలుగునిచ్చే చిన్న డెస్క్ లాంప్ పెట్టుకుంటే మీ వర్క్ ఏరియా చాలా ప్రశాంతంగా, క్లాసీగా మారిపోతుంది.

ఆగస్టు 18 వరకు ఆగని వానలు?
ఉత్తర ఒడిశాలో భారీ వర్షాలు, వరదల వల్ల 5 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఆగస్టు 18 వరకు భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించడమే కాకుండా అధికారుల లీవులను రద్దు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలైన భద్రక్, జాజ్పూర్ జిల్లాల్లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నారు.

పథకాలు ఆపొద్దని BRS నాయకుల నిరసన
TG: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో BRS నాయకులు ర్యాలీ నిర్వహించారు. మాజీ MPTC గజేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గజేంద్ర మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు వంటి పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

రూ.16కే బట్టలు.. షాపు దగ్గర జనం చేసిన రచ్చ!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో ఓ బట్టల వ్యాపారి ప్రకటించిన ఫ్లాష్ సేల్ తీవ్ర గందరగోళానికి దారితీసింది. రయీస్ ఆలమ్ అనే వ్యాపారి ఏ క్లాత్ కొన్నా కేవలం రూ.16కే ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఆఫర్ కేవలం 16 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పడంతో భారీగా జనం షాపు వద్దకు పరుగులు తీశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. స్థానికులకు ఇబ్బందులు కలగడంతో పోలీసులు వ్యాపారిపై FIR నమోదు చేశారు. వ్యాపారితో పాటు ఇంకొంతమందిపై చర్యలు తీసుకున్నారు.

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి: సీతక్క
TG: ములుగు జిల్లా గోవిందరావుపేట మండల MPDO కార్యాలయంలో మంత్రి సీతక్క సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆమె స్వయంగా వినతులను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించిన మంత్రి, వాటిని సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పెరిగిన బంగారం ధరలు!
అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం ఉదయం హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేట్ రూ.530 పెరిగి రూ.1,55,660కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.500 మేర పెరిగి రూ.1,42,700 దగ్గర ట్రేడ్ అవుతోంది. పసిడి మార్కెట్లో ప్రైసెస్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి షాపింగ్ ప్లాన్ చేసుకునే ముందు లైవ్ రేట్స్ క్రాస్ చెక్ చేసుకోవడం బెస్ట్.
నిద్రమత్తులో డ్రైవింగ్.. బోల్తా కొట్టిన సుబాబుల్ లారీ
AP: NTR జిల్లా మైలవరం-ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై మైలవరం బైపాస్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి వరంగల్కు సుబాబుల్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్కు గాయాలు కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

GO 97 రద్దు చేయాలి: SFI
TG: నిర్మల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట సోమవారం SFI ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ITI కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATC) మార్చే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్లొమా కోర్సులను ITI, ATCలతో అనుసంధానం చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఎస్ఎఫ్ఎ జిల్లా కన్వీనర్ దిగంబర్ అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.97ను రద్దు చేసి, SBTET వ్యవస్థను కొనసాగించాలని కోరారు.

మనిషిని ఉద్యోగంలోంచి తీసేసిన 'AI' మేనేజర్
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 'అండన్ ల్యాబ్స్' కంపెనీ స్టోర్లో రూల్స్ చూసుకునే 'లూనా' అనే AI మేనేజర్, 23 రోజుల్లో 17 సార్లు లేట్గా డ్యూటీకి వచ్చిన మనిషిని ఉద్యోగం నుంచి తీసేసింది. ప్రపంచంలోనే AI బాస్ మనుషులను ఉద్యోగంలోంచి తొలగించడం ఇదే తొలిసారి. మొదట్లో ఈ AI తాను తయారుచేసిన హాజరు రూల్స్ మర్చిపోయి ఉద్యోగికి ఆఫర్లు ఇచ్చింది. ఆ తర్వాత కంపెనీ అధికారులు రూల్స్ గుర్తుచేసి ప్రశ్నించేసరికి లూనా అలెర్ట్ అయి, ఆ ఉద్యోగిని తీసేయమని రికమండ్ చేసింది.

డివైడర్ను ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
TG: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగి PS పరిధిలోని కాళీ మందిర్ వద్ద బైక్పై వెళ్తున్న బీటెక్ విద్యార్థి వికాస్ (23) అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన వికాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

DSCపై 141 కేసులు.. అసెంబ్లీలో లోకేష్ వివరణ
AP: అసెంబ్లీలో DSCపై మంత్రి నారా లోకేష్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. YSRCP నేతలు కావాలనే DSCపై కేసులు వేశారని, 141 కేసులు వేసినా అవేవీ కోర్టులో నిలబడలేదని అన్నారు. అత్యంత పారదర్శకంగా DSC నిర్వహించామని, TCS iON సెంటర్ల ద్వారా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఏటా DSC నిర్వహిస్తామని ఇచ్చిన హామీతో తొలి ఏడాదే 16,347 పోస్టులతో DSC నిర్వహించామని చెప్పారు. గతంలోని 29 స్పోర్ట్స్ కేటగిరీలను 65కు పెంచామని, కేంద్ర నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్ కోటాను పెంచినట్లు లోకేష్ వివరించారు.
ఆటో కార్మికులకు బిగ్ రిలీఫ్.. త్వరలో సంక్షేమ బోర్డు
తెలంగాణలో ఆటోకార్మికుల సంక్షేమం కోసం త్వరలో బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. HYDలోని మినిస్టర్ క్వార్టర్స్లో తెలంగాణ KKC యూనియన్ ప్రతినిధులు కలిసి ఆటోకార్మికుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి మాట్లాడుతూ.. ఆటోఛార్జీల పెంపుపై కార్మిక సంఘాల విజ్ఞప్తిని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునేందుకు ఒక్కోఆటోకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.

వివాహ వేడుక అనంతరం విషాదం
AP: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం లంకలపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కుటుంబం వివాహ కార్యక్రమం ముగించుకుని కారులో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి, రోడ్డు పక్కనున్న వాగులో పడిపోయింది. ఘటనలో వనమాల లక్ష్మి(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Cooking Show హోస్ట్గా సమంత!
హీరోయిన్ సమంత త్వరలోనే ' సెలబ్రిటీ మాస్టర్చెఫ్ తమిళ' అనే కుకింగ్ రియాలిటీ షో హోస్ట్గా మన ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రోమోను కూడా సోనీ పిక్చర్స్ రిలీజ్ చేసింది. ఈ షో Sony LIV ఓటీటీతో పాటు సోనీ టీవీ ఛానళ్లలో కూడా టెలికాస్ట్ కానుంది. తమిళ మూవీస్, టీవీ రంగానికి చెందిన సెలబ్రిటీలు ఇందులో కంటెస్టెంట్లుగా సందడి చేయబోతున్నారు. "నా కెరీర్లో ఇలాంటి కుకింగ్ కాంపిటీషన్ షో ఎప్పుడూ చేయలేదు, ఈ కొత్త ఛాలెంజ్ కోసం చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నా" అని సమంత తెలిపారు.

ఐదేళ్లు DSC ఎందుకు వేయలేదు? బొత్సకు అచ్చెన్న ప్రశ్న
AP: మెగా DSCపై YSRCP నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు శాసనమండలిలో ప్రశ్నలు వేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఐదేళ్లపాటు DSC ఎందుకు నిర్వహించలేదని బొత్సను ప్రశ్నించారు. DSC వేయాలని అప్పటి CM జగన్ను ఎందుకు కోరలేదని నిలదీశారు. దీంతో YSRCP MLCలు పోడియం వద్ద నిరసన విరమించారు. ఇదిలా ఉండగా, ఇటీవల అస్వస్థతకు గురైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా కొందరు పరామర్శించారు.

కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి...డాన్సర్లుగా మారిన యువత!
ఢిల్లీలో యూత్ డ్యాన్స్ పై ఉన్న ఇష్టంతో కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేసి, సొంతంగా బిజినెస్లు పెట్టి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్గా దూసుకెళ్తున్నారు. కమ్నా అరోరా, ఉత్సవ్ మల్హోత్రా అనే జంట 'ఎల్లో స్ట్రైప్స్ డ్యాన్స్ కంపెనీ' స్టార్ట్ చేసి పెళ్లిళ్లలో డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయడంతో పాటు కేఫ్లు కూడా నడుపుతున్నారు. నిధి భాటియా అనే మహిళ ఐటీ జాబ్ వదిలేసి 'క్రియేటివ్ డిటాక్స్' పేరుతో ఆర్ట్, డ్యాన్స్ స్టూడియో మొదలుపెడితే, మాన్సి గార్గ్ అనే అమ్మాయి 'సోల్ స్టూడియో' ద్వారా ట్రైనింగ్ ఇస్తోంది.

పెండింగ్ సమస్యలపై విద్యుత్ ఉద్యోగుల బిగ్ ప్రొటెస్ట్
TG: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 19న హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని జెన్కో ఉద్యోగులు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (KTPP) వద్ద మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఉద్యోగులు ఆవిష్కరించి నిరసన తెలిపారు. PRC-2026 అమలు, యాదాద్రి ప్లాంట్లో ఔట్సోర్సింగ్ నిలిపివేత, పెండింగ్ ప్రమోషన్లు, ఖాళీలభర్తీ, పాత పెన్షన్ విధానం అమలు తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు.

హోటల్లో మంటలు.. 7 మంది సజీవ దహనం!
వెస్ట్ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్లో ఈరోజు తెల్లవారుజామున హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపు ఉదయం 5 గం. మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఎక్కువ మంది అతిథులు నిద్రలో ఉండటంతో కొందరు లోపల చిక్కుకున్నారు. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా, కొందరికి గాయాలయ్యాయి. వారిని రాంపూర్హాట్ గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

నవ్వు ఓ పొలిటికల్ వెపన్
నవ్వు అంటే సరదా మాత్రమే కాదు, సమాజంలో ప్రెజర్ తగ్గించి, ప్రశ్నించే తత్వాన్ని పెంచే గొప్ప శక్తి అని స్టాండప్ కమెడియన్ అజీమ్ బనాత్వాలా అంటున్నారు. ఈ రోజుల్లో కామెడీ ద్వారా, వ్యంగ్యంతో ప్రశ్నించే వాళ్లపై ఆంక్షలు పెట్టడం,షోలు క్యాన్సిల్ చేయడం వంటి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయని ఆయన బాధపడ్డారు. Gen-Z మాత్రం మీమ్స్, సోషల్ మీడియా కామెడీతో పొలిటీషియన్లను,సమాజాన్ని ప్రశ్నిస్తోందని ఆయన చెప్పారు. ఒక హెల్దీ డెమోక్రసీలో విమర్శకి, హాస్యానికి చోటుండాలని, ప్రశ్నించే కామెడీ లేకపోతే సొసైటీలో మార్పే రాదని అన్నారు.