Latest

వెండితెరపై 'మిర్జాపూర్'
Cinema· 12 Aug 2026

వెండితెరపై 'మిర్జాపూర్'

భారతీయ ఓటీటీ చరిత్రలో సంచలనం సృష్టించిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది. రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్న ఈ భారీ మూవీ అధికారిక ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. గుర్‌మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, సిరీస్‌లో అదరగొట్టిన ప్రధాన నటీనటులందరూ మళ్లీ పెద్ద తెరపై కనిపించనున్నారు . ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రానుంది.

స్టూడెంట్స్‌కు నీళ్ల చారు, ఉడకని అన్నం
AP· 12 Aug 2026

స్టూడెంట్స్‌కు నీళ్ల చారు, ఉడకని అన్నం

AP: కర్నూలు జిల్లా హొళగుంద ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై SFI నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నీళ్ల చారు, సరిగ్గా ఉడకని అన్నం అందిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రస్తుత వంట ఏజెన్సీని వెంటనే రద్దు చేసి, నాణ్యమైన, పౌష్టికాహారం అందించే ఏజెన్సీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

జైలులో ఫోన్-పెన్‌డ్రైవ్‌తో చిక్కిన ప్రజ్వల్ రేవణ్న
Politics· 12 Aug 2026

జైలులో ఫోన్-పెన్‌డ్రైవ్‌తో చిక్కిన ప్రజ్వల్ రేవణ్న

బెంగళూరు: హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న (మాజీ ప్రధాని HD దేవెగౌడ మనవడు) జైల్లో జల్సాలు చేస్తున్నాడా? పనిమనిషిపై రేప్ కేసులో జీవిత ఖైదీగా ఉన్న రేవణ్న దగ్గర ఫోన్, పెన్ డ్రైవ్ గుర్తించారు. 2024 లోక్‌సభ ఎన్నికల టైంలో బయటికొచ్చిన రేవణ్న సెక్స్ కుంభకోణం పెద్ద సంచలనం. JDS-BJP అభ్యర్థిగా పోటీ చేసిన రేవణ్న ఆ ఎన్నికల్లో ప్రధాని మోదీ వచ్చి ప్రచారం చేసినా ఓడిపోయారు. 2025లో కోర్టు దోషిగా తేల్చి జీవిత ఖైదు శిక్ష వేసింది. రేవణ్నకు ఫోన్ ఎలా వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు. ఓ జైలు అధికారిని సస్పెండ్ చేశారు.

హాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టేలా 'రామాయణ'
Cinema· 12 Aug 2026

హాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టేలా 'రామాయణ'

నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ సినిమా 'రామాయణ' పార్ట్-1 నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా 59 వేల స్క్రీన్లలో విడుదల కానుంది. సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంతో కేవలం ఓవర్సీస్‌లోనే 50 వేల స్క్రీన్లలో విడుదల చేస్తూ ‘పుష్ప 2’, ‘RRR ’లతో పాటు హాలీవుడ్ చిత్రం ‘అవతార్ 2’ రికార్డులను కూడా ఇది దాటుతుంది. ఈ సినిమాని 'బ్రహ్మ AI' అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 40కి పైగా భాషల్లో గ్లోబల్ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.

లాజిస్టిక్స్ గోదాంలో షాకింగ్ ఫైర్
TG· 12 Aug 2026

లాజిస్టిక్స్ గోదాంలో షాకింగ్ ఫైర్

TG: మేడ్చల్ జిల్లా దేవరయంజాల్‌లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు రెండు గంటలుగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియల్సి ఉంది.

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤
Science· 12 Aug 2026

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤

నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఒక్కసారిగా కింద పడుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడటం చాలామందికి జరుగుతుంది. దీనిని ‘హిప్నిక్ జర్క్’ అంటారు. నిద్రలోకి మారే సమయంలో కండరాలు ఒక్కసారిగా జర్క్ అవడం వల్ల ఈ అనుభూతి వస్తుంది. మనం నిజంగా పడిపోతున్నామని కాదు.. మెదడు, శరీరం మేల్కొనే స్థితి నుంచి నిద్రలోకి మారుతున్న సమయంలో వచ్చే సహజ స్పందన ఇది. ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ కెఫీన్ వంటివి దీన్ని మరింత పెంచొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఇలా జరగడం సాధారణమే. మీకు కూడా ఇలా జరిగిందా? కామెంట్‌లో చెప్పండి. 👇

మణిపూర్‌లో మళ్లీ హింస!
News· 12 Aug 2026

మణిపూర్‌లో మళ్లీ హింస!

కొన్నాళ్లుగా వార్తల్లో లేని మణిపూర్ ప్రశాంతంగా అయితే లేదు. జాతుల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. కాంగ్‌పోక్పి జిల్లాలోని 'టోక్‌పా లియాంగ్‌మై నాగా' గ్రామంలోకి మంగళవారం రాత్రి కొందరు కాల్పులు జరుపుతూ, ఇళ్లకు నిప్పు పెట్టారు. దాదాపు 9 గుడిసెలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. 2023 మే నెలలో మణిపూర్లో కుకీ, మెయిటీ జాతుల మధ్య ఘర్షణ తలెత్తి వందల మంది చనిపోయారు. వేలాది మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2025 ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.

మనవడి కోసం 400 KM పాదయాత్ర
AP· 12 Aug 2026

మనవడి కోసం 400 KM పాదయాత్ర

AP: గుంటూరు కృష్ణానగర్‌కు చెందిన ఆకుల కామేశ్వరి మనవడు ధనుష్‌(20) రెండేళ్ల క్రితం అనారోగ్యానికి గురై కాళ్లు, చేతులు చచ్చుబడిన పరిస్థితికి చేరుకున్నాడు. వైద్యులు కోలుకోవడం కష్టమని చెప్పడంతో వెంకన్నపై భారం వేసిన కామేశ్వరి, మనవడి ఆరోగ్యం మెరుగుపడితే గుంటూరు నుంచి తిరుమలకు నడిచి వస్తానని మొక్కుకున్నారు. ఆరోగ్యంలో కొంత మార్పు రావడంతో జూన్‌ 11న పాదయాత్ర ప్రారంభించారు. 57రోజుల పాటు గోవింద నామస్మరణ చేస్తూ 400కిలో మీటర్లు ప్రయాణించి తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.

లైబ్రరీ ఫండ్స్ బకాయిలు..
News· 12 Aug 2026

లైబ్రరీ ఫండ్స్ బకాయిలు..

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ గ్రంథాలయాల అభివృద్ధి కోసం విడుదల చేయాల్సిన నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రజల నుంచి వసూలు చేసే ఆస్తి పన్నుతో పాటు 8శాతం 'లైబ్రరీ సెస్'ను కూడా వసూలు చేస్తాయి. అయితే, ఈ విధంగా వసూలైన నిధులను మున్సిపాలిటీలు, పంచాయతీలు గ్రంథాలయ సంస్థలకు బదిలీ చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ. 213 కోట్లు, తెలంగాణలో రూ. 302.49 కోట్ల మేర లైబ్రరీ సెస్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

తల్లి కాబోతున్న వేళ విషాదం..  ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
TG· 12 Aug 2026

తల్లి కాబోతున్న వేళ విషాదం.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

TG: ప్రసవం కోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చేరిన 9నెలల గర్భిణీ అనిత (33) మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. చౌటకూర్ మండలం బద్రిగూడెంకు చెందిన అనితను కుటుంబసభ్యులు ఈ నెల 10న ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమెకు ఇవాళ తెల్లవారుజామున ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారు. అయితే సరైన సమయంలో వైద్యం అందకపోవడం, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ కూతురు మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

హైదరాబాద్‌కు 'ట్రంప్' టవర్స్
News· 12 Aug 2026

హైదరాబాద్‌కు 'ట్రంప్' టవర్స్

TG : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అమెరికాకు చెందిన ప్రముఖ 'ట్రంప్ ఆర్గనైజేషన్' అడుగుపెట్టింది. ట్రెబెకా డెవలపర్స్, స్థానిక ఇరా రియల్టీ భాగస్వామ్యంతో కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్డులోని 4 ఎకరాల్లో 65 అంతస్తులతో రెండు ట్రంప్ టవర్లను నిర్మిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రూ.1,800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టులో 450 లగ్జరీ అపార్ట్‌మెంట్లు, 16 పెంట్ హౌస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించి నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
News· 12 Aug 2026

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,040 పెరిగి రూ.1,54,860 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.950 పెరిగి రూ.1,41,950 వద్ద, 18 క్యారెట్ల బంగారంపై రూ.770 పెరిగి రూ.1,16,140కి చేరింది. బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతుండటంతో కొనేవారు భయపడుతున్నారు.

మళ్లీ హాస్టల్‌కు పంపుతారనే భయంతో బాలిక ఆత్మహత్య
TG· 12 Aug 2026

మళ్లీ హాస్టల్‌కు పంపుతారనే భయంతో బాలిక ఆత్మహత్య

TG: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామానికి చెందిన 11ఏళ్ల బాలిక మైనారిటీ హాస్టల్‌లో 5వ తరగతి చదువుతుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రేషన్‌కార్డు eKYC కోసం పదిరోజుల క్రితం తల్లి ఆమెను ఇంటికి తీసుకొచ్చింది. అయితే తిరిగి హాస్టల్‌కు వెళ్లేందుకు బాలిక ఇష్టపడకపోవడంతో, ఆమెను హాస్టల్ నుంచి మాన్పించి TC తీసుకురావడానికి తల్లి అక్కడికి వెళ్లింది. ఈ సమయంలో బాలిక ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. తిరిగి హాస్టల్‌కు పంపిస్తారనే భయంతోనే ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మనకు మనమే టిక్లింగ్ చేసుకుంటే ఎందుకు నవ్వుకోలేం? 🤔
Education· 12 Aug 2026

మనకు మనమే టిక్లింగ్ చేసుకుంటే ఎందుకు నవ్వుకోలేం? 🤔

మనకు మనమే టిక్లింగ్ చేసుకుంటే ఎందుకు పెద్దగా నవ్వు రాదు? కారణం మన మెదడు ముందుగానే మనం చేయబోయే పనిని అంచనా వేయడమే. మన చేతి కదలికతో వచ్చే స్పర్శను మెదడులోని సెరెబెల్లమ్ ముందే ఊహించి, ఆ అనుభూతిని కొంత తగ్గిస్తుంది. కానీ ఇంకొకరు టిక్లింగ్ చేస్తే ఎప్పుడు, ఎక్కడ తాకుతారో మనకు తెలియదు. అందుకే ఆ స్పర్శ కొత్తగా అనిపించి టిక్లింగ్ ఫీల్ ఎక్కువగా ఉంటుంది. పరిశోధనలు కూడా మనమే చేసుకునే స్పర్శకు మెదడు స్పందన తక్కువగా ఉంటుందని సూచిస్తున్నాయి. మరి మీకు మీరు టిక్లింగ్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది?

HCUలో డ్రగ్స్ కలకలం
Politics· 12 Aug 2026

HCUలో డ్రగ్స్ కలకలం

TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. క్యాంపస్‌లో మత్తుపదార్థాల వినియోగం, విక్రయాలపై సమాచారం అందడంతో తెలంగాణ ఈగల్ టీమ్, పోలీసులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలువురు విద్యార్థులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, 17మందికి గంజాయి పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్న ఓ డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్సాం నుంచి గంజాయి తీసుకొచ్చి క్యాంపస్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

యాక్షన్ సీన్స్ చేయడం అంత తేలిక కాదు!
Cinema· 12 Aug 2026

యాక్షన్ సీన్స్ చేయడం అంత తేలిక కాదు!

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తన కెరీర్, నిర్మాణ రంగంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సున్నితంగా ఉండే అమ్మాయి యాక్షన్ సీన్స్ చేస్తుంటే ప్రేక్షకులు ఒప్పుకోవడం అంత తేలిక కాదని, కానీ ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్’ సిరీస్‌లలో తన యాక్షన్‌కు మంచి స్పందన వచ్చిందని ఆమె తెలిపారు. అలాగే నిర్మాణం వైపు రావడం వల్ల తనకు నచ్చిన పనులు చేసుకునే స్వేచ్ఛ దక్కిందన్నారు. తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ‘శుభం’, ‘మా ఇంటి బంగారం’ ప్రాజెక్టులు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయని తెలిపారు.

ఇంటి ముందు హత్య.. గ్రామంలో హైటెన్షన్
Crime· 12 Aug 2026

ఇంటి ముందు హత్య.. గ్రామంలో హైటెన్షన్

AP: పల్నాడు జిల్లా దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో దారుణ హత్య కలకలం రేపింది. ఇంటి బయట నిద్రిస్తున్న కొమ్ము ఇమ్మాన్యుయేల్(35)పై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న గురజాల DSP ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పాత కక్షలు, వ్యక్తిగత వివాదాల కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు ముమ్మరం చేశారు.

యష్ 'టాక్సిక్' సీన్స్ కట్!
Cinema· 12 Aug 2026

యష్ 'టాక్సిక్' సీన్స్ కట్!

KGF హీరో యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాకు సెన్సార్ బోర్డు 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది. అయితే మనదేశ సెన్సార్ నిబంధనల ప్రకారం కొన్ని సీన్లను కట్ చేయడం లేదా మార్చడం చేస్తున్నారట. దీంతో ఇండియాలో చూసే వర్షన్ వేరు, విదేశాల్లో విడుదలయ్యే వర్షన్ వేరుగా ఉంటుందా అనే ప్రచారం నడుస్తుంది. దీనిపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

విద్యార్థినులపై అనుచిత ప్రవర్తన.. అధికారులు సీరియస్
Crime· 12 Aug 2026

విద్యార్థినులపై అనుచిత ప్రవర్తన.. అధికారులు సీరియస్

AP: అనంతపురం జిల్లా యల్లనూరు ZP ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీరామమూర్తిపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టగా ఆరోపణలు నిజమని తేలింది. టీచర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ఆలియా నటనలో 'అమ్మ' పాత్రే టాప్: మహేష్ భట్!
Cinema· 12 Aug 2026

ఆలియా నటనలో 'అమ్మ' పాత్రే టాప్: మహేష్ భట్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటనను దర్శకుడు, ఆమె తండ్రి మహేష్ భట్ మెచ్చుకున్నారు. 'హైవే', 'గంగూభాయి' చిత్రాల్లో ఆలియా నటన నన్ను ఆశ్చర్యపరిచింది. కానీ ఈరోజుల్లో ఆమె పోషిస్తున్న 'అమ్మ' పాత్రే అత్యుత్తమమైనది అని అన్నారు.<br>ఆలియా ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు భార్యగా, తల్లిగా బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తోందన్నారు. మనవరాలు 'రాహా' వచ్చిన తర్వాత ఇంట్లో కొత్త ఉత్సాహం వచ్చిందని, ఆమె తమ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన వెలుగు అని చెప్పారు.

ఆస్పత్రిలోనే బాలింత సూసైడ్
TG· 12 Aug 2026

ఆస్పత్రిలోనే బాలింత సూసైడ్

TG: నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27) ప్రసవం కోసం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ప్రసవం అనంతరం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున వార్డు నుంచి బయటకు వచ్చి హాస్పిటల్ ఆవరణలో చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వరుసగా నలుగురు ఆడపిల్లలే పుట్టడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, అత్తింటి వేధింపులే మమత ఆత్మహత్యకు కారణం అని ఆమె బంధువులు ఆరోపించారు.