Latest
'పైసా నక్కో' రూట్ మార్చిన నకిలీ పోలీస్!
తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద లారీ డ్రైవర్ను నకిలీ పోలీసులు రూ.200 లంచం డిమాండ్ చేశారు. దానికి భయపడకుండా ఆ డ్రైవర్ తన స్మార్ట్ఫోన్తో స్పాట్లోనే రికార్డింగ్ స్టార్ట్ చేశాడు. సదరు వ్యక్తులకు కనీసం నేమ్ప్లేట్ కూడా లేకపోవడాన్ని పాయింట్ అవుట్ చేస్తూ, లంచం ఎందుకు ఇవ్వాలని గట్టిగా నిలదీశాడు. సీన్ రివర్స్ అవ్వడంతో షాక్ తిన్న ఆ వ్యక్తులు 'పైసా నక్కో' అంటూ మాట మార్చేశారు. హైవేలపై ఇలా ఐడీ కార్డ్, నేమ్ప్లేట్ లేకుండా మిమ్మల్ని ఎవరైనా ఆపి మనీ డిమాండ్ చేస్తే నకిలీ పోలీసులు కావచ్చు, అలర్ట్ గా ఉండండి.

"రాహుల్ చెప్పిందే చెప్పాలి!": BJP MP
"రాజకీయాల్లో స్క్రిప్ట్ మారొచ్చు.. కానీ బ్యాక్స్టోరీ మారదేమో!" అన్నట్టుగా BJP MP నిశికాంత్ దూబే చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు చాలా ఏళ్ల నాటి ఫ్రెండ్ అని, ఇద్దరూ కలిసి ఒకప్పుడు RSS, ABVP కోసం పనిచేశామని చెప్పారు. "రేవంత్ రెడ్డి మైండ్సెట్ బాగుంటుంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిందే చెప్పాల్సిన పరిస్థితి" అంటూ కామెంట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో "రాజకీయాల్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉంటారా.. లేక పర్మనెంట్ పార్టీలా?" అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
కేంద్ర కేబినెట్ ఇవాళ సమావేశమైంది. ప్రధాని సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీటిపై ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్, ఇంధన నిల్వ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఈ పథకం కోసం రూ.5070 కోట్లు కేటాయిస్తారు. దీనిద్వారా ఐదేళ్లలో 5 వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతోపాటు ఖేలో ఇండియా పథకానికి రూ.29 వేల కోట్లు కేటాయించనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఐదేళ్లకు పొడిగించి, దానికి రూ.3,15,614 కోట్లు కేటాయించారు.

ఏపీ-తెలంగాణకు కొత్త రైల్వే లైన్
ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల నుంచి తెలంగాణలోని గద్వాల్ వరకు కొత్త రైల్వే లైన్ కోసం కేంద్ర రైల్వే శాఖ సర్వే సిద్ధం చేసింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆరు కొత్త రైల్వే లైన్లలో ఇది ఒకటి. ఈ మార్గం ఏర్పడితే తెలంగాణ, కర్ణాటక నుంచి ఏపీ పోర్టులకు సరుకు రవాణా వేగవంతం కానుంది. దీంతో పాటు పల్నాడు, నాగార్జునసాగర్ ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ పెరగనుంది.
రోడ్డు పక్కన పానీపూరీ తింటున్నారా?
TG : హైదరాబాద్లోని అత్తాపూర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి బోర్డు లేకుండా రహస్యంగా నిర్వహిస్తున్న ఒక ఫుడ్ సెంటర్ లో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితుల్లో భారీగా పానీపూరీలు, సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని నగరంలోని వివిధ రోడ్డు పక్కన ఉండే బండ్లకు సరఫరా చేస్తున్న ఈ అక్రమ తయారీ పై అధికారులు, కఠిన చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన దొరికే ఆహారం పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు.

పెళ్లి వద్దన్న గాయని జమునారాణి..రీజన్ అదేనా?
ఇవాళ మరణించిన సీనియర్ గాయని జమునారాణికి ఆమె అభిమానులు, కళాకారులు నివాళి అర్పిస్తున్నారు. ఐదు భాషల్లో సుమారు 6 వేలకు పైగా పాటలు పాడారామె. జీవితాంతం అవివాహితగానే ఉన్నారు. అందుకు కారణాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. తోటి గాయనీమణుల వైవాహిక జీవితాలు, వారి కష్టాలు చూడటం వల్లనే ఆమె వివాహానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

వెండితెరపైకి బాలయ్య చిన్న కుమార్తె !
నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని త్వరలోనే నటిగా వెండితెరకు పరిచయం కాబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా, యువతకు స్ఫూర్తినిచ్చే ఒక ప్రయోగాత్మక స్పోర్ట్స్ డ్రామా కథతో ఆమె ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆహా 'అన్స్టాపబుల్' టాక్ షోకి క్రియేటివ్ హెడ్గా, పలు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఆమె, కెమెరా ముందుకు రాబోతున్నారనే ప్రచారంతో నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

విద్యార్థుల అడ్మిషన్లపై SIR ఎఫెక్ట్ : RS ప్రవీణ్ కుమార్
TG : EAPCET, NEET, CPGET కోర్సుల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ కోసం కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాలను సమర్పించడంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. స్థానిక మండల రెవెన్యూ అధికారులు SIR ప్రక్రియలో బిజీగా ఉన్నామని సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల విద్యార్థులు అడ్మిషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోల్పోయే ప్రమాదం ఉందని, వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని ‘ఎక్స్’లో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని డిమాండ్ చేశారు.

భార్య పాయల్తో CM ఒమర్ అబ్దుల్లా విడాకులు
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, అతని భార్య పాయల్కు సుప్రీంకోర్టు విడాకులు ఇచ్చింది. వీళ్లిద్దరూ తమ ఇష్టంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 1994లో వీరికి పెళ్లి కాగా, 2011 నుంచి వేరుగా ఉంటున్నారు. 2016లో ఒమర్ విడాకుల కోసం అడగగా ఫ్యామిలీ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఒప్పుకోలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇద్దరూ మాట్లాడుకుని విడిపోవాలని నిర్ణయించుకోవడంతో కోర్టు వారికి విడాకులు ఇస్తామంది.

రేపే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం
AP: రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ను పీఎం నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య రంగాలకు కొత్త ఊపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

రేషన్ కార్డు KYC పేరుతో వసూళ్లు
హైదరాబాద్ LBనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్ జైపురి కాలనీలో రేషన్ కార్డుల KYC పేరుతో కొందరు ఒక్కొక్కరి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వం కేవైసీ ప్రక్రియను పూర్తిగా ఉచితంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా డబ్బులు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు చెల్లించిన తర్వాతే కేవైసీ పూర్తి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు వెంటనే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

‘రామాయణ’లో సాయి పల్లవి పై బాలీవుడ్ ట్రోల్స్!
‘రామాయణ’ చిత్రంలో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవిపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ‘ఆదిపురుష్’లో కృతి సనన్ సీతగా మెరుగ్గా నటించిందని, ఈ పాత్రకు ఆమే సెట్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ప్రాంతీయ దురభిమానంతోనే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారని, ఆమె అద్భుతమైన నటనను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని సౌత్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

కంకర రాళ్లకు బంగారు పూతతో మోసం
TG: నిజామాబాద్ హమాల్వాడీకి చెందిన రమేష్ దగ్గర శ్రీనివాస్ రూ.1.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని రమేష్ అడగడంతో, తనకు గుప్తనిధులు దొరికాయని శ్రీనివాస్ నమ్మించాడు. అప్పు కింద బంగారు రాళ్లు ఇస్తానని చెప్పి 'డిచ్పల్లి' దగ్గర ఉన్న ఘన్పూర్కు పిలిపించాడు. పైగా అదనంగా మరో రూ.32 వేలుతీసుకొని నాలుగు కుండల్లో నాలుగు రాళ్లు ఇచ్చాడు. తరువాత రమేష్ వాటిని చూసి అవి బంగారు రంగు వేసిన కంకర రాళ్లు అని గుర్తించాడు. తాను మోసపోయానని గ్రహించి డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఒలెక్ట్రా గ్రాండ్ మైలురాయి: 4,000 చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సు
భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ (OGL) చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు అందించిన ఎలక్ట్రిక్-బస్సుల సంఖ్య 4,000కు చేరింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్కు 4,000వ బస్సును అందజేయడంతో ఈ ఘనత సాధ్యమైంది. హెచ్ఆర్టీసీకి ఒలెక్ట్రా మొత్తం 297 బస్సులను సరఫరా చేసింది.ఈ 4,000 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటివరకు 73 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి, 6.5 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించింది.

ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల లిస్ట్ విడుదల
AP: ఆంధ్రప్రదేశ్లో SIR ముసాయిదా ఓటర్ల లిస్ట్ను విడుదల చేసినట్లు రాష్ట్ర CEO వివేక్ యాదవ్ వెల్లడించారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ను సమర్పించిన 3.71 కోట్ల మంది వివరాలను ముసాయిదా లిస్ట్లో చేర్చినట్లు తెలిపారు. ఇందులో 15.22 లక్షల మంది మరణించినట్లు, రెండు చోట్ల నమోదైన 7.37 లక్షల ఓట్లను గుర్తించామని చెప్పారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలుంటే స్వీకరిస్తామని, అర్హులైన వారు <a href="https://www.ceodelhi.gov.in/WriteReadData/userfiles/file/Forms/FORM6.pdf">ఫామ్-6</a> ద్వారా ఓటరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. అక్టోబర్ 3న చివరి ఓటర్ల లిస్ట్ను విడుదల చేస్తామని సీఈవో స్పష్టం చేశారు.

వాగులోకి దూసుకెళ్లిన సిలిండర్ల లారీ
AP: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో కడప వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి పిల్లాపేరు వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. సిలిండర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

నిరసనల తర్వాత మహిళలకు ఆన్లైన్ బెదిరింపులు
ఇటీవల రోజుల్లో నిరసనల్లో పాల్గొన్న మహిళలను సోషల్ మీడియాలో కొందరు తీవ్రంగా బెదిరిస్తున్నారు. ప్రధానిని తిట్టారని ఒక మహిళ పేరు, ఊరు వివరాలు ఆన్లైన్లో పెట్టారు. అలాగే జంతర్ మంతర్ దగ్గర వీడియో తీసిన ఒక 23ఏళ్ల స్టూడెంట్ ఆవీడియో సోషల్ మీడియాలో పెట్టి డిలీట్ చేసి క్షమాపణలు చెప్పినా, ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నారు. కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు పనికట్టుకుని మహిళల లొకేషన్లు, అడ్రస్లు, ఫోన్ నంబర్లు బయటపెడుతూ వారిని భయపెడుతున్నాయి.
తెలంగాణ నయాగరా ఉగ్రరూపం
TG: భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని ప్రసిద్ధ కుంటాల జలపాతం జలకళను సంతరించుకుని ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలపాతం మరింత ఉగ్రరూపం దాల్చింది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నప్పటికీ, నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై తాత్కాలికంగా సందర్శనను నిలిపివేసినట్లు తెలిపారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యాటకులు కుంటాల జలపాతం వైపు రావద్దని సూచించారు.

Situationship Vs Relationship
"మేము రిలేషన్లో లేం... కానీ రోజూ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, కాల్స్, డేట్స్, పోజెసివ్ ఫైట్స్ అన్నీ ఉంటాయి!" ఇదే ఇప్పుడు Gen Zలో ఫుల్ ట్రెండ్ అవుతున్న Situationship. అంటే రిలేషన్షిప్లో ఉన్నట్టే ఉంటారు... కానీ "నువ్వు నా గర్ల్ఫ్రెండ్/బాయ్ఫ్రెండ్ కదా?" అంటే వెంటనే "లేబుల్స్ ఎందుకు బ్రో?" అంటారు. 😭 సింపుల్గా చెప్పాలంటే, Relationship అంటే Love + Commitment ❤️, Situationship అంటే Love + Confusion + Unlimited Overthinking + "మనం అసలు ఏమిటి?" అనే డైలీ డౌట్! OTP రావడం ఈజీ Commitment రావడం కష్టం! 🤡

కన్నీళ్లు పెట్టిస్తున్న నటుడి పరిస్థితి!
ఒకప్పుడు మలయాళ చిత్రసీమలో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా గుర్తింపు పొందిన 'మోహన్ శర్మ'. ఇప్పుడు ఆయనకు 70 సంవత్సరాలు చెన్నై సమీపంలోని గుమ్మిడిపూండి వృద్ధాశ్రమంలో జీవిస్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఆయనను ఒంటరిని చేశాయి. జీవితాంతం మందులు అవసరమైన పరిస్థితిలో ఉన్న ఆయనకు వాటిని కొనుగోలు చేసే స్థోమత కూడా లేదు. తాను నిర్మించి, దర్శకత్వం వహించిన 'గ్రామం' చిత్ర శాటిలైట్ హక్కులు అమ్ముడైతే వచ్చే డబ్బుతో వైద్య ఖర్చులు భరిస్తానని ఆశిస్తూ సహాయం కోరుతున్నారు.
నేతకు వీడ్కోలు.. నర్సంపేటలో జనవెల్లువ
తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ MLA <a href="https://www.theclearcutnews.com/n/XCo6KYd">పెద్ది సుదర్శన్ రెడ్డి</a>కి అంతిమ వీడ్కోలు పలికేందుకు వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు నర్సంపేటకు తరలివచ్చారు. ఆయన భౌతికకాయాన్ని చివరిసారి చూసేందుకు పెద్దఎత్తున జనం రావడంతో పట్టణమంతా శోకసంద్రంగా మారింది. ప్రధాన రహదారులన్నీ జనంతో నిండిపోవడంతో రెండు కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలుకుతూ ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. నాయకులు, కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.