ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల లిస్ట్ విడుదల

AP: ఆంధ్రప్రదేశ్లో SIR ముసాయిదా ఓటర్ల లిస్ట్ను విడుదల చేసినట్లు రాష్ట్ర CEO వివేక్ యాదవ్ వెల్లడించారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ను సమర్పించిన 3.71 కోట్ల మంది వివరాలను ముసాయిదా లిస్ట్లో చేర్చినట్లు తెలిపారు. ఇందులో 15.22 లక్షల మంది మరణించినట్లు, రెండు చోట్ల నమోదైన 7.37 లక్షల ఓట్లను గుర్తించామని చెప్పారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలుంటే స్వీకరిస్తామని, అర్హులైన వారు <a href="https://www.ceodelhi.gov.in/WriteReadData/userfiles/file/Forms/FORM6.pdf">ఫామ్-6</a> ద్వారా ఓటరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. అక్టోబర్ 3న చివరి ఓటర్ల లిస్ట్ను విడుదల చేస్తామని సీఈవో స్పష్టం చేశారు.



