← Back to news

నేతకు వీడ్కోలు.. నర్సంపేటలో జనవెల్లువ

By DK· 31 Jul 2026· వరంగల్ జిల్లా

తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ MLA <a href="https://www.theclearcutnews.com/n/XCo6KYd">పెద్ది సుదర్శన్ రెడ్డి</a>కి అంతిమ వీడ్కోలు పలికేందుకు వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు నర్సంపేటకు తరలివచ్చారు. ఆయన భౌతికకాయాన్ని చివరిసారి చూసేందుకు పెద్దఎత్తున జనం రావడంతో పట్టణమంతా శోకసంద్రంగా మారింది. ప్రధాన రహదారులన్నీ జనంతో నిండిపోవడంతో రెండు కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలుకుతూ ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. నాయకులు, కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.

More in Politics