పాడుబడ్డ గదిలో మృతదేహం

AP: సత్యసాయి జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చిలమతూరు మండలం కనిశెట్టిపల్లి గ్రామ శివారులో NH-44 పక్కన ఉన్న పాడుబడ్డ గదిలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు రెండు రోజుల క్రితమే కొబ్బరిపీచు తాడుతో ఉరివేసుకుని మృతిచెందినట్లు తెలిపారు. మృతుడు ఎరుపు రంగు టీషర్ట్, నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడు. ఘటనాస్థలంలో లభించిన బ్యాగులో షాంపూ, డియో, టూత్పేస్ట్ మాత్రమే ఉండగా ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



