MRO కార్యాలయం కోసం నడిరోడ్డుపై వంటావార్పు

ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ కార్యాలయాలుండాలి కానీ, ఎక్కడో ఊరి చివరన నిర్మిస్తామంటే ఎట్ల అని ప్రజలు అడుగుతున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మండల కార్యాలయాలు మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలనే డిమాండు ఊపందుకుంటున్నది. తాజాగా మంచిర్యాల జిల్ల కన్నెపల్లి మండల కేంద్రంలోనే MRO కార్యాలయం నిర్మించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రజలు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులు రోడ్డెక్కారు. శుక్రవారం ఆటో స్టాండ్ వద్ద నడిరోడ్డుపై వంటావార్పు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


