← Back to news

దాతల సహకారంతో అదనపు తరగతిగదులు ప్రారంభం

By Rajaratnam· 21 Aug 2026
దాతల సహకారంతో అదనపు తరగతిగదులు ప్రారంభం

AP: గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ప్రారంభించారు. నిర్మాణానికి కృషి చేసిన గ్రామ సీనియర్ నాయకుడు వాసిరెడ్డి జయరామయ్యను అభినందించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు.

More in Local