సమస్యలను లేవనెత్తడానికి కాకపోతే పార్లమెంట్ దేనికోసం?
సీజేపీ నిరసనపై కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ స్పందించారు. అహింసాత్మక నిరసన జరుగుతుండగా లాఠీ చార్జ్ చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. లాఠీ చార్జ్ హింసాత్మక చర్య అని, దీని వెనుక కారణమేంటో అర్థం కావడం లేదన్నారు. ప్రజలు తమ ఆందోళనలను వ్యక్తం చేసే స్థలం కావాలని, కనీసం పార్లమెంట్ అందుకు అవకాశం ఇవ్వాలన్నారు. పార్లమెంట్ ఈ సమస్యలను లేవనెత్తడానికి కాకపోతే మరి దేనికోసం అని ప్రశ్నించారు.


