ఇరాన్ ప్రభుత్వానికి అతివాద శక్తుల వార్నింగ్ !

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత అక్కడ అధికారం కోసం యుద్ధం మొదలైంది. US తో శాంతి చర్చలు జరుపుతున్న అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశీ మంత్రిలను అక్కడి తీవ్రవాద శక్తులు టార్గెట్ చేస్తున్నారు. ఖమేనీ అంత్యక్రియల్లో దేశ నాయకులను "ద్రోహులు" అని నిందిస్తూ రాళ్లు రువ్వారు. కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు రాకపోవడంతో, అధ్మ్యక్షుడు అతని బృందం రాజకీయ కుట్రకు ప్లాన్ చేస్తున్నారని హార్డ్లైనర్స్ ఆరోపిస్తున్నారు. "ప్రెసిడెంట్ గారూ, మా కండిషన్స్ వినకపోతే మా బ్లేడ్ మీ మెడపై ఉంటుంది" అంటూ కొందరు బహిరంగంగానే బెదిరింపులు చేస్తుండటంతో ఇరాన్ లో పొలిటికల్ హీట్ పెరిగింది.


