తిరుపతి ఫ్లైట్ టికెట్ల ధరలకు రెక్కలు

AP: హైదరాబాద్–తిరుపతి విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. గంట ప్రయాణానికి రూ.5,700 నుంచి చివరి నిమిషంలో రూ.24 వేల వరకు వసూలు చేస్తున్నారు. దింతో భక్తులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎయిర్పోర్ట్లో లభించే శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లకు ఉన్న అధిక డిమాండ్ వల్లే ఈ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఉదయం పూట విమానాల్లో వచ్చేవారికి ఈ టికెట్లు సులభంగా లభిస్తుండటంతో ఎయిర్లైన్స్ అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.



